హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణలో కంటతడి పెట్టిన గాలి, రిమాండ్ పొడిగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ రెడ్డి రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. దీంతో ఈ నెల 28 వరకు వారు జైలులోనే ఉండాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా సిబిఐ కోర్టుకు తీసుకు రాలేమని అధికారులు చెప్పడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు గాలిని, శ్రీనివాస్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. సుమారు పది నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్సు విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి కంట తడి పెట్టారు.

తమ కుటుంబం తమపై ఆధారపడి ఉందని గాలి, శ్రీనివాస్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. తన గైర్హాజరీలో తమ కుటుంబం అనేక ఇబ్బందులకు గురవుతుందని వారు కోర్టుకు విన్నవించారు. తాను దైవ ప్రమాణకంగా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గాలి విచారణలో కోర్టుకు చెప్పారు. కాగా ఎమ్మార్ కేసులో అరెస్టు చేసిన కోనేరును తమకు కస్టడీకి అప్పగించాల్సిందిగా సిబిఐ వేసిన పిల్ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

English summary
CBI special court extended Karnataka former minister Gali Janardhan Reddy's remand for two weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X