సిబిఐ విచారణకు భయపడేది లేదు: చంద్రబాబు

Chandrababu Naidu
విజయనగరం: తన ఆస్తులపై సిబిఐ విచారణకు భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ సీనియర్ నేత పి. అశోక్ గజపతిరాజుతో మంతనాలు జరిపిన అనంతరం సోమవారం హైకోర్టు ఆదేశాలపై స్పందించారు. తన ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన స్వాగతించారు. తనపై బురద చల్లేందుకే తన ఆస్తులపై హైకోర్టులో పిటిషన్ వేశారని, తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి పిటిషన్లు వేశారని ఆయన విమర్శించారు.

తాను ఇప్పటికే తన అస్తులనే కాకుండా తన కుటుంబ సభ్యులను ఆస్తులను కూడా ప్రకటించానని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని గతంలోనే నిరూపితమైందని ఆయన అన్నారు. తాను ఏ విధమైన తప్పూ చేయలేదని, విచారణకు భయపడేది లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణలో తాను నిర్దోషిగా బయటపడుతానని ఆయన దీమా వ్యక్తం చేశారు. తనకు నోటీసు ఇవ్వకుండా తన ఆస్తుల వ్యవహారంపై ప్రాథమిక విచారణకు ఆదేశించడం సరి కాదని ఆయన అన్నారు. ఈ విషయంపై న్యాయవాదులతో చర్చిస్తానని, ఆ తర్వాత ఏ విషయమూ మాట్లాడుతానని ఆయన అన్నారు. సింగపూర్‌లో తనకు హోటల్ ఉందనే ఆరోపణలో నిజం లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ హైకోర్టు సోమవారం ఆ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి మూడు నెలల్లోగా సీల్డ్ కవర్‌లో తమకు నివేదిక అందిచాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+