చంద్రబాబుపై జగన్ వర్గం రోజా, అంబటి ఎదురు దాడి

Ambati Rambabu-Roja
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సోమవారం ఆహ్వానించారు. బాబు అక్రమాస్తులపై సిబిఐ లోతుగా విచారణ జరపాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా అభిప్రాయపడ్డారు. బాబు ప్రకటించిన ఆస్తుల చిట్టా చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ అల్లుడిగా, హెరిటేజ్ కుటుంబలోని కీలక వ్యక్తిగా ఆస్తుల విలువ ఏపాటిదో ప్రజలు సునాయాసంగా గ్రహించగలరన్నారు. అబద్దానికైనా ఒక హద్దుండాలన్నారు. బాబును ఎలాగైనా సిఎంను చేస్తే ఆయన అండతో బతకవచ్చని ఎల్లో మీడియా పన్నాగంగా ఉందని అయితే పదేళ్లుగా వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడుతూనే ఉన్నారన్నారు.

హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించడంతో ఆయన ఆస్తుల ప్రకటనలోని నిజమెంతో కనిపిస్తోందని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. బాబు బినామీ ఆస్తులపై దర్యాఫ్తు చేయాల్సి ఉందన్నారు. తాను నిజాయితీపరుడినంటూ అల్లిబిల్లిగా ఆస్తుల విలువ ప్రకటించి అన్నాహజారే దీక్షకు మద్దతుగా నిరాహార దీక్షలు చేసినంత మాత్రాన ప్రజలు ఆయన మాటలు విశ్వసించలేరన్నారు. త్వరలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జూపూడి అభిప్రాయపడ్డారు. వచ్చే సమావేశాలో అసెంబ్లీకి చివరి సమావేశాలు అన్నారు.

బాబు తొమ్మిదేళ్ల పానలో అక్రమాలు విచారణ ద్వారా బయటకొస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వారం రోజులుగా ఎల్లో మీడియా జగన్ పైన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన విషపూరిత ప్రచారం చేస్తోందని విమర్శించారు. బాబు నీతివంతుడని దేశంలో ఎవరూ అనుకోవడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+