తెలంగాణపై ప్రధాని ప్రకటన మీద కేశవరావు గుర్రు

K Keshav Rao
హైదరాబాద్: ఇప్పుడు తెలంగాణ ఇవ్వలేమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు వ్యతిరేకించారు. ప్రధాని ప్రకటన దురదృష్టకరమని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సోమవారం సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. తెలంగాణ ఇవ్వబోమని ప్రకటిస్తే తెలంగాణ సాధన కోసం కఠిన నిర్ణయాలకు దిగుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎన్నికలకైనా తాము సిద్ధపడుతామని ఆయన అన్నారు. తమకు 1956కు ముందున్న తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తప్ప ఎస్సారీ, ఇతర ప్రత్యామ్నాయాలకు అంగీకరించబోమని ఆయన అన్నారు. తెలంగాణపై రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కూడా ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తే ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతామని మరో పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుల్లో చీలికలు లేవని చెప్పారు. సకల జనుల సమ్మె, ఆత్మబలిదానాలు చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడం సరి కాదని కె. కేశవరావు అన్నారు. తెలంగాణపై ప్రధాని ప్రకటనను ఖండిస్తున్నట్లు మరో పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+