Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పరకాల విజ్ఞుడన్న తెలంగాణ నేతలు,టీవీలో చర్చ

Revanth Reddy-Nayini Narasimha Reddy
హైదరాబాద్: విశాలాంధ్ర మహా సభ నేత పరకాల ప్రభాకర్‌పై తెలంగాణ నేతలు సోమవారం ఓ టీవి ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. సాధారణంగా తెలంగాణ వ్యతిరేకులను నేతలు విమర్శిస్తుంటారు. అయితే పరకాలపై ప్రశంసలు కురిపించడం విశేషం. అదే సమయంలో ఆయన తీరును మాత్రం సున్నితంగా తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరకాల ఆయన ఇంటి దగ్గర నుండి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరకాల చాలా డెకరేటెడ్‌గా మాట్లాడతారని ఆయన తన చక్కని మాటలతో తెలంగాణ వాదులను మార్చే ప్రయత్నం చేస్తారని అన్నారు. ఆయనపై దాడిని తాను ఖండిస్తున్నానని, భౌతిక దాడులకు తాము వ్యతిరేకమని అయితే ఆయన తన మాటల చతురతతో తెలంగాణవాదులలో మార్పు తీసుకు వచ్చే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.

టిఆర్ఎస్ నేత నాయిని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించడం విశేషం. పరకాల విజ్ఞులని, ఆయన చాలా చక్కగా మాట్లాడతారని చెప్పారు. రేవంత్ చెప్పినట్లుగా ఆయన తన చతురతతో మార్చగలరని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో దాడిని నాయిని కూడా ఖండించారు. దాడి ఘటనకు తమ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా క్షమాపణలు చెప్పారన్నారు. పరకాల తెలివైన వారని తాము ఒప్పుకుంటున్నామని అయితే ఆయన వెనుక సమైక్యవాదుల కుట్ర ఉందని ఆరోపించారు. పరకాల మాట్లాడుతూ విభజన కోరుకునే వారు, విభజనను వ్యతిరేకించే వారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఉన్నారని చెప్పారు. కాగా ఆదివారం పరకాల ప్రభాకర్ పైన తెలంగాణవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+