చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: విజయనగరం జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. రైతులపై ప్రేమ, అభిమానం కన్నా రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని, రైతు పోరు బాటు నిర్వహిస్తున్న చంద్రబాబు ఎక్కువ సమయం ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడానికే వెచ్చిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనపై విజయనగరం జిల్లా పర్యటనలో చంద్రబాబు వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు.

తన వాదన వినకుండా హైకోర్టు తన ఆస్తులపై విచారణకు ఆదేశించడం సరి కాదని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు చెప్పినట్లు కోర్టు చేయాలా అని ఆయన అన్నారు. తాను నీతిమంతుడినని చెప్పుకునే చంద్రబాబు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని అలవాటు చేసుకున్నారని, అలా నీతిమంతుడైతే హైకోర్టు తనకు నోటీసు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసిందని ఎందుకు అంటున్నారని ఆయన అన్నారు. విచారణ చేసుకోవచ్చునని చంద్రబాబు సూటిగా మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. దోపిడీ దొంగతనం చంద్రబాబుకే అలవాటు అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+