చిక్కుల్లో చంద్రబాబు, వైయస్ జగన్పై దాడికి బ్రేక్లు

హైకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం నాయకులు చాలా మంది వెంటనే ఎలా స్పందించాలో అర్థం కాక మిన్నకుండిపోయారు. ఆ తర్వాత మెల్లగా గొంతు విప్పి, తమ నాయకుడు నిర్దోషిగా బయటకు వస్తారని చెబుతూ వచ్చారు. ఆ విషయం అలా ఉంటే, రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ నే తగిలిందని చెప్పవచ్చు. సిబిఐ విచారణను అసరా చేసుకుని రాజకీయంగా వైయస్ జగన్ను దెబ్బ తీయాలనే చంద్రబాబు వ్యూహం ఫలించే సూచనలు కనిపించడం లేదు. జగన్ అవినీతిపై ఆరోపణలు చేసే స్థితి కూడా లేకుండా పోయింది. జగన్ అవినీతి గురించి మాట్లాడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చంద్రబాబుపై హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆసరా చేసుకుని విరుచుకుపడే అవకాశం ఉంది.
తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న వైయస్ జగన్కు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు హైకోర్టు ఆదేశాలు కొంత మేరకు ఊరటనిచ్చినట్లే చెప్పాలి. విచారణల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి రాజకీయంగా చంద్రబాబు చేస్తున్న దాడి నుంచి వారు బయటపడ్డారు. చంద్రబాబు నుంచి గానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి గానీ సిబిఐ విచారణను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా చేసే వ్యాఖ్యల నుంచి మాత్రం రక్షణ లభించినట్లు చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications