చిరంజీవి రచ్చబండలో వామపక్షాల రచ్చరచ్చ

Chiranjeevi
తిరుపతి: తిరుపతిలో కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి రచ్చబండలో వామపక్షాల కార్యకర్తలు మంగళవారం రచ్చరచ్చ చేశాయి. పట్టణంలోని మంచినీటి సమస్యపై సిపిఐ, సిపిఎం కార్యకర్తలు కరపత్రాలు పంచారు. చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో రచ్చబండ కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ జోక్యం చేసుకోవడం పరిస్థితి సద్దుమణిగింది. తిరుపతి నగరంలో మంచినీటి సమస్యను రెండు నెలల్లో శాశ్వతంగా పరిష్కరిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని ఆయన చెప్పారు.

నగరంలో మంచినీరు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండో నెలల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. స్వయం సహాయక గ్రూప్ మహిళలకు రుణాలు అందిస్తామని ఆయన చెప్పారు. తిరుపతి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం ఉదయం తిరుపతి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+