నాలుగు రాష్ట్రాలుగా యుపి విభజన: మాయావతి

వచ్చే శానససభ ఎన్నికల్లో తన ప్రతిపాదన విజయాన్ని అందిస్తుందని మాయావతి నమ్ముతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి, తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆమె ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మాయావతి ప్రతిపాదనను రాజకీయ క్రీడగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విస్తృతమైన చర్చల తర్వాత, అనుకూల ప్రతికూల అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదనను అంగీకరించినట్లు మాయావతి తెలిపారు. పెద్ద రాష్ట్రాల్లో కన్నా చిన్న రాష్ట్రాల్లో వ్యవహారాలు నడపడం సులభమవుతుందని ఆమె అన్నారు. పెద్ద రాష్ట్రం కావడం వల్లనే యుపి వెనకబడిపోయిందని ఆమె అన్నారు.
దేశానికి యుపి ఎక్కువ మంది ప్రధానులను అందించినప్పటికీ వారెవరూ రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విభజన, పునర్వ్యస్థీకరణ, రాష్ట్రాల పేర్లను పార్లమెంటు నిర్ధారిస్తుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications