తెలంగాణ ఎంపిల రాజీనామాల తిరస్కరణ

తెలంగాణపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాజీనామాలపై తొందరపడవద్దని స్పీకర్ గతంలో ఓసారి కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు సూచించారు. తాము పార్లమెంటుకు వెళ్లి తెలంగాణ కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. పార్లమెంటు వేదిక తెలంగాణవాణి వినిపిస్తామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. అవసరమైతే మళ్లీ రాజీనామాలు చేస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇదిలావుంటే, తెలంగాణలోని ఆత్మహత్యలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఓ న్యాయవాది వేసిన పిటిషన్పై విచారణ వచ్చే నెల 14వ తేదీకి వాయిదా పడింది. తెలంగాణలోని ఆత్మహత్యలకు సోనియా గాంధీదే బాధ్యత అంటూ న్యాయవాది పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications