Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెవిపికి చుట్టుకుంటున్న ఎమ్మార్ స్కామ్ గొడవ

KVP Ramachandra Rao
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం వ్యవహారం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుకు కూడా చుట్టుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఎపిఐఐసి వాటాను తగ్గించి, ఎమ్మార్ వాటాను పెంచిన విషయం కెవిపి రామచంద్రరావుకు తెలుసునని ఎమ్మార్ ప్రాపర్టీస్ దుబాయ్ సంస్థ (పిజెఎస్‌సి)కు 2005 వరకు సిఇవోగా వ్యవహరించిన ఎ.జె. జగన్నాథన్ సిబిఐతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. జగన్నాథన్ వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మార్ చైర్మన్ అలబ్బర్, స్టైలిష్ హోమ్స్ మేనేజింగి డైరెక్టర్ కోనేరు ప్రసాద్‌లు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్ర రావులతో జరిపిన సమావేశంలోనే హైదరాబాదు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఎపిఐఐసి వాటను 49 శాతం నుంచి 26 శాతానికి తగ్గిస్తూ ఎమ్మార్ వాటాను 51 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ నిర్ణయం జరిగిందని జగన్నాథన్ సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత అలబ్బర్ వైయస్ రాజశేఖర రెడ్డిని విడిగా కలిసినట్లు జగన్నాథన్ సిబిఐకి చెప్పాడు.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంగళవారం పెన్నా సిమెంట్స్ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు. పెన్నా సిమెంట్స్ వైయస్ జగన్‌కు చెందిన వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. దానికి ప్రతిఫలంగానే పెన్నా సిమెంట్స్‌కు సున్నపురాయి గనులను లీజుకు ఇచ్చారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అరబిందో కంపెనీ ప్రతినిధులు కూడా మంగళవారం సిబిఐ ముందు హాజరయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+