సుప్రీంకోర్టుకు చంద్రబాబు: జగన్ సాక్షి రివర్స్ అటాక్
చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే పార్టీలోని వ్యాపారవేత్తలు హైకోర్టు తీర్పుపై తక్షణం సుప్రీంలో సవాల్ చేయాలని సమావేశంలో కోరారని, అయితే పార్టీ నేతల వాదన మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలిస్తోందని చెప్పింది. ఇప్పటివరకు జరిగిన అనేక విచారణల్లో నిర్దోషిగా బయటపడినట్లు చెప్పుకుంటున్నందున పూర్తిస్థాయి విచారణకు సిద్ధపడి క్లీన్ చిట్ తెచ్చుకోవాలని అలా అయితే పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందని పార్టీ కోటరీకి సంబంధం లేని నాయకులు గట్టిగా చెప్పారని, అయితే బాబు మాత్రం కోటరీ నాయకులు చెప్పిన దాన్ని సమర్థిస్తూ మన వాదన వినకుండా హైకోర్టు తీర్పు చెప్పిందని ఈ విషయంలో సూప్రీంను ఆశ్రయించాల్సిందేనని సీనియర్ నేతలతో బాబు అన్నట్టు పార్టీ వర్గాల తెలిసిందని చెప్పింది.
అంతేకాకుండా అనేక విషయాల్లో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తూ కాంగ్రెసు సర్కారును కాపాడుతుంటే ప్రభుత్వం మాత్రం మన మీద సిబిఐ విచారణ వేయడమేమిటని ఓ నేత మండిపడ్డారని చెప్పింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని మనపై అనేక రకాలుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వెనకడుగు వేస్తూ సర్కారును కాపాడుతుంటే మనకు ఇదా ప్రతిఫలం సదరు నేత ఆవేదన చెందారని తెలిపింది. రాష్ట్రంలో సర్కారును కాపాడుతున్నందున ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు తీవ్రతరం చేయాలని, ఇందుకు రిలయన్స్ సంస్థ సహకారం తీసుకోవాలని, ఢిల్లీలో ఉన్న సంబంధాలతో వెంటనే బయటపడేటట్టు చేయాలని పార్టీకి చెందిన ఒక నేత, మరోవ్యాపారవేత్త బాబును కోరారని పేర్కొంది.