హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వానికి ఓటు: జగన్‌వర్గం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adinarayana Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆది నారాయణ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పూతలపట్టు రవి, బాబురావు శుక్రవారం స్పీకర్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే తాము ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. పనుల కోసమే ప్రభుత్వం వెంట ఉంటామని అదే సమయంలో జగన్‌ను విడిచి పెట్టేది లేదని చెప్పారు.

తాము డబ్బుల కోసం ఆశ పడే వాళ్లం కాదన్నారు. జగన్‌కు ఆపద వస్తే ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తాననడం, జగన్‌కు ఆపద వస్తే ఆదుకుంటానని చెప్పడంపై విలేకరులు ప్రశ్నించగా తాము చేసేది తప్పేమీ కాదన్నారు. రాజీనామాపై స్పీకర్ నాదెండ్ల మనోహర్‌దే అంతిమ నిర్ణయమన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరో ఎమ్మెల్యే బాబూరావు చెప్పారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. మేం ఎప్పుడూ జగన్ వెంటే ఉంటామని చెప్పారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy camp mla Adinarayana Reddy make controversial comments today after met speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X