అది వైయస్ జగన్ వైఫల్యం కాదు: బొత్స సత్తిబాబు

Botsa Satyanarayana
హైదరాబాద్: శాసనసభ్యులు తిరిగి తమ పార్టీలోకి రావడం వైయస్ జగన్ వైఫల్యమూ కాదు, తమ పార్టీ విజయమూ కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ వెంట వెళ్లి తమ పార్టీకి రాజీనామా చేసిన శానససభ్యుల వివరణ కోరామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొంత మంది శాసనసభ్యులు అవినీతిపరుల వెంట వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లేవారు తమ పార్టీ శానససభ్యులు కారని, తమ పార్టీ శాసనసభ్యుల తమ పార్టీ కార్యాలయానికి రావాల్సిందేనని ఆయన అన్నారు. కాంగ్రెసు జగన్ కమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని జగన్ అంటున్నారని, ఎవరినీ వేధించే ఉద్దేశం తమకు లేదని, కాంగ్రెసు ఎవరినీ వేధించదని ఆయన అన్నారు.

తాము అధికారం కోసం అర్రులు చాచడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే హక్కు ఉందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ఎదుర్కుంటామని, తమకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన ఆన్నారు. అన్ని విషయాలపై శాసనసభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శానససభా సమావేశాల తర్వాత తాను తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. కర్నూలు, ఒంగోలుల్లో ఈ నెలలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలకు పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులను డిసెంబర్ 1వ తేదీన పిసిసి విచారించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+