పవన్ వ్యాఖ్యలు: డ్యామేజీ కంట్రోల్లో చిరంజీవి ఫ్యామిలీ
పవన్ కళ్యాణ్ ఒంటరి వాడు కాదంటూ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు అరవింద్ ప్రకటన ఇచ్చారు. తామంతా కలిసే ఉన్నామని ఆయన చెప్పారు. తాను షూటింగు నుంచి ఆలస్యంగా రావడం వల్ల కార్యక్రమానికి వెళ్లలేకపోయారని, రామ్ చరణ్ తేజ్ చైనాలో షూటింగులో ఉన్నారని, చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని ఆయన చెప్పారు. గురువారంనాడు తాజాగా చిరంజీవి గొంతు విప్పారు. మీడియా వార్తలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్తో తనకు ఏ విధమైన విభేదాలు లేవని, ఫంక్షన్కు హాజరు కాకపోయినంత మాత్రాన దూరమైనట్లు కాదని, తాను చాలా ఫంక్షన్లకు వెళ్లలేదని ఆయన అన్నారు. వారసత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన అభినందించారు.
మొత్తం మీద, లోపల ఏం జరుగుతోందో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమైన ఒకటి తర్వాత మరొకటి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. బయటకు కనిపించేదే వాస్తవంగా ప్రచారంలోకి వస్తుంది. తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్కు, చిరంజీవి కుటుంబానికి మధ్య దూరం పెరిగిందనే వార్తలను మాత్రం దుమారం రేపుతున్నాయి.