మాయావతిది రాజకీయ విభజన: వెంకయ్య నాయుడు

దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం అంశాలపై తామిచ్చిన నోటీసులపై చర్చించేందుకు యుపిఎ ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్నవారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని ఆయన అడిగారు. రిటైల్ రంగంలో ఎఫ్డిఐ పెట్టుబడులకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. దీనివల్ల చిరు వ్యాపారులు, సన్నకారు రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు సక్రమంగా జరగకపోవడానికి యుపిఎ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications