తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి వైయస్ జగన్ పార్టీ రెడీ

ఎన్నికల సమయంలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని జగన్ తెలంగాణ ప్రాంత నాయకులకు సూచించినట్లు చెబుతున్నారు. పార్టీ క్యాడర్ను నిలబెట్టుకోవడానికి పోటీ చేయడమే మంచిదని తెలంగాణ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. బాన్సువాడ ఉప ఎన్నికలో మౌనంగా ఉండిపోవడానికి బదులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డికి ప్రచారం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏమైనా, ఉప ఎన్నికల్లో పోటీపై తెలంగాణ నాయకుల్లో విస్తృతమైన చర్చే జరుగతోంది.












Click it and Unblock the Notifications