అలక వీడిన చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డికే పిఆర్పీ ఓటు

Chiranjeevi
హైదరాబాద్: ఎట్టకేలకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దిగి వచ్చారు. సోనియా రాజకీయ సలహదారు అహ్మద్‌పటేల్ ఆదివారం ఆయనతో జరిపిన ఫోన్ చర్చలు ఫలించాయి. అధిష్ఠానం నుంచి హామీ లభించడంతో మెత్తబడ్డారు. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అండగా నిలబడతానని ప్రకటించారు. రెండు రోజుల ఉత్కంఠకు తెర దించారు. పార్టీ విలీనం నాటినుంచీ తమ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తిని పీఆర్పీ ఎమ్మెల్యేలు శనివారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారికి చిరంజీవి మద్దతుగా నిలవడంతో అవిశ్వాసంపై అప్పటిదాకా ధీమాతో ఉన్న అధికార పక్షంలో ఒక్కసారిగా గుబులు రేగింది. దీంతో రాష్ట్ర, జాతీయ నేతలు రంగంలోకి దిగి బుజ్జగింపు ముమ్మరం చేశారు. శనివారం చిరంజీవితో నేరుగా భేటీ అయిన పీసీసీ చీఫ్ బొత్స- ఆదివారం ఫోన్‌లో మాట్లాడా రు.

సీఎం కిరణ్, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి ఆజాద్ మరోసారి చిరంజీవికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఈ సమయంలో ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్ మంతనాలు జరిపి, పరిస్థితిని చక్కదిద్దారు. బొత్సతో మాట్లాడినప్పుడు తమ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తిని చిరంజీవి మరోసారి బయటపెట్టారు. విలీనం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారినా.. వారికి గౌరవమర్యాదలు లభించడంలేదు'' చెప్పారు. ఇక మీదట వివక్ష ఉండదని పటేల్ చెప్పారు. పీఆర్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమానంగా చూస్తారని, రెండువారాల్లో ఫలితా లు కనిపిస్తాయని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

"ప్రభుతాన్ని పడగొట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజల తీర్పునకు కట్టుబడి ప్రభుత్వానికి అండగా నిలిచాం. మా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వాస్తవమే. దానికి కారణం ప్రభుత్వమే. వారి నియోజకవర్గాల్లో చిన్నచిన్న పనులూ చేయకపోవడంతో కిందిస్థాయి కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అహ్మద్‌పటేల్, ఆజాద్, సీఎం ఫోన్‌చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమానంగా చూస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. మా మధ్య పొరపొచ్చాలను ఆసరా చేసుకొని కొన్ని అసాంఘిక శక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వారి ఆటలు సాగకుండా ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తాం'' అని ప్రకటించారు. ప్రజా రాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు వారే ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారని పీసీసీ అధ్యక్షుడు బొత్స ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+