నేను ఒక్కడినే, కానీ నా వెనక కోటి మంది: జూలకంటి

చంద్రబాబు మాట్లాడితే గాలి మాటలు మాట్లాడుతారని అందరికీ తెలుసునని, సిపిఎం సభ్యుడు పద్ధతిగా మాట్లాడుతారని అనుకున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి సలహాదారు మాదిరిగా రంగారెడ్డి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో రాసివ్వండని జూలకంటి రంగారెడ్డి మంత్రులను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకుని అనిశ్చితిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పష్టమైన వైఖరి తీసుకోలేని స్థితిలో కాంగ్రెసు ఉందని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఆయన కాంగ్రెసుకు సవాల్ విసిరారు. సభలో తాను ఒక్కడినే ఉండవచ్చు గానీ తన వెనక కోటి మంది వామపక్షవాదులు ఉన్నారని ఆయన అన్నారు. కరువు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications