రామోజీ రావు పిటిషన్పై హైకోర్టు విచారణ ప్రారంభం

ప్రస్తుతం తాము ప్రాథమిక విచారణకు మాత్రమే ఆదేశించామని, ఆరోపణలు ఎదుర్కున్నవారిపై వారి విచారణకు గతంలో ఆదేశించిన సందర్భాలు ఉన్నాయని, అదే రీతిలో ఇప్పుడు ఆదేశాలు ఇచ్చామని హైకోర్టు బెంచ్ తెలిపింది. ప్రాథమిక విచారణలో తేలిన అంశాలను బట్టి నోటీసులు జారీ చేసి మీ వాదన కూడా వింటామని కోర్టు తెలిపింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్పై హైకోర్టు చంద్రబాబుతో సహా 13 మందిపై విచారణ జరపాలని సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డిజిపి, హోంశాఖ కార్యదర్శులను ఆదేశించిన విషయం తెలిసిందే.
రామోజీ రావు వెకేట్ పిటిషన్పై హైకోర్టు విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. తమ వాదనలు వినకుండా ప్రాథమిక విచారణకు ఆదేశించడం సరి కాదని రామోజీ రావు తరఫు న్యాయవాది అన్నారు. తమకు తమ వాదనలు వినిుపించే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత నోటీసులు ఇవ్వవచ్చు కదా అని న్యాయమూర్తి అడిగారు. ప్రతివాదులను నిందితులుగా పేర్కోనడం లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున ప్రాథమిక విచారణను కొనసాగనివ్వాలని వైయస్ విజయమ్మ తరఫు న్యాయవాది కోరారు. విచారణకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని కోరారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications