వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంతో బొత్స భేటీ: జగన్ ఎమ్మెల్యేలపై వేటు కోసమే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana and CM Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. వారిరువురు సిఎం క్యాంపు కార్యాలయంలో సుమారు గంట సేపు చర్చించారు. కిరణ్ ఢిల్లీ పర్యటన ముగించుకొని రాగానే బొత్సతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విప్ ఉల్లంఘించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలపై సోమవారం పార్టీ తరఫున స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న తరుణంలో వీరు భేటీ అయ్యారు. ప్రధానంగా ఢిల్లీ పర్యటన, జగన్ ఎమ్మెల్యేలపై వేటు విషయమే వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

పిసిసి చీఫ్‌తో పాటు సీనియర్ మంత్రులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయమై నిర్ణయిస్తామని సిఎం శనివారం ఢిల్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో బొత్సతో భేటీ అయి అదే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వారిపై వేటు వేసేందుకు అధిష్టానం కూడా మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో వారిపై వేటు, ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.

English summary
PCC chief Botsa Satyanarayana met CM Kiran Kumar Reddy and talked about Jagan camp mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X