వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్నా హజారే దీక్ష: రాహుల్ను టార్గెట్ చేసిన కేస్రీవాల్
అన్నా మద్దతుదారులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. అందరూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. లోక్ పాల్ బిల్లుపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతల్ని హజారే ఆహ్వానించారు. ఈ చర్చలో బిజెపి నేత అరుణ్ జైట్లీ, జెడి నేత శరద్ యాదవ్, సిపిఎం నేత బృందాకారత్, టిడిపి తరఫున ఎర్నన్నాయుడు పాల్గొన్నారు. కాగా హజారే దీక్షపై కాంగ్రెసు పార్టీ స్పందించింది. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటులోనే చట్టాలు రూపొందుతాయని జంతర్ మంతర్ వద్ద కావని విమర్శించింది. బిజెపి మద్దతుతోనే అన్నా ఉద్యమం నడుస్తోందని ఆరోపించింది. ఇబ్బంది పెట్టేందుకే ఉద్యమం నడుపుతున్నారని, లోక్ పాల్ బిల్లును అఢ్డు పెట్టుకొని హజారే రాజకీయం చేస్తున్నారన్నది.
English summary
Anna Hazare started his fast at Janthar Manthar today for lokpal bill.
Story first published: Sunday, December 11, 2011, 12:43 [IST]