ఆదర్శంగా తీసుకోవాలని ఢిల్లీలో చెప్పుకుంటారు: సిఎం

kiran kumar reddy
హైదరాబాద్: నక్సలిజం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని న్యూఢిల్లీలో చెప్పుకుంటారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం పోలీసు అధికారుల సమావేశంలో అన్నారు. పోలీసులకు సవాళ్లతో పాటు బాధ్యతలు పెరిగాయని, అంతర్జాతీయ టెర్రరిజం వంటి పలు సవాళ్లను ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. సైబర్, వైట్ కాలర్ నేరాలు ఇటీవల బాగా పెరిగాయన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర చాలా కీలకమన్నారు. కాలానుగుణంగా వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించుకోవాలన్నారు. విధుల నిర్వహణలో పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల్లో పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరుగుతుందన్న భరోసా పెరిగేలా వ్యవహరించాలని సూచించారు.

ప్రదర్శనకారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, కొత్త సవాళ్లను ఎదుర్కొనడానికి అత్యుత్తమ శిక్షణ అవసరమన్నారు. మారుతున్న పరిస్థితులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పోలీసులు ఉద్యోగం కత్తి మీద సాము అని చెబుతూ పాతకాలం నాటి పోలీసింగ్ ఇప్పుడు లేదన్నారు. ప్రజలు పోలీసు స్టేషన్‌కు రావాలంటే భయపడే పరిస్థితి పోవాలన్నారు. ప్రజలకు మిత్రుల్లా ఉంటూ ప్రజా ఆస్తులను రక్షించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+