వైయస్ జగన్ ఎమ్మెల్యేలకు కిరణ్ కుమార్ రెడ్డి చిక్కులు

తన వ్యూహంలో భాగంగానే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్ వేయాలని అనుకుంటున్నారు. తమ శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్లడం వల్ల తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో వారిని గెలిపిస్తే తమ నియోజకవర్గాలకు ఏ విధమైన ప్రయోజనమూ చేకూరదని, అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తేనే ఫలితం ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆ నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకులకు అభివృద్ధి పనులు అప్పగించాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాలకు ముందుగానే పార్టీ అభ్యర్థులను గుర్తించి, నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
మరో వైపు, ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మంత్రులు, పార్టీ శ్రేణులతో కలిపి ఓ జట్టును ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. కిందిస్థాయి నాయకత్వానికి తగిన భాగస్వామ్యం కల్పిస్తూ ఈ జట్ల ఏర్పాటు జరుగుతుందని అంటున్నారు. వారిపై అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యతను మోపుతారని అంటున్నారు. తద్వారా వైయస్ జగన్ శాసనసభ్యుల విజయావకాశాలను దెబ్బ తీయాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications