తెలంగాణకు వ్యతిరేకిని కాను, పరిమితులంతే: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తాను తెలంగాణకు వ్యతిరేకిని కానని, పార్టీ అధ్యక్షుడిగా తనకు కొన్ని పరిమితులున్నాయని తెలుగుదేశం పార్టీ అధక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన తెలంగాణ నాయకులకు సూచించారు. గత కొద్ది రోజులుగా ఆయన ఉప ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా నాయకులతో సమీక్షా సమావేశం జరిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ అభ్యర్థిగా జగదీశ్వర్ రావును ఎంపిక చేశారు. ఈ సీటు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తారు. కాగా, నాగర్ కర్నూలుకు అభ్యర్థిని ఎంపిక చేయలేదు. శరత్ గౌడ్, డాక్టర్ చెన్నయ్య, బాలేశ్వర్, సుకన్య, జెసి జనార్దన్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థి ఖరారుకు సమన్వయ కమిటీని వేశారు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేయనున్నారు. నాగం జనార్దన్ రెడ్డి బలమైన నాయకుడు కావడంతో అభ్యర్థి ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ శాసనసభా స్థానానికి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ పేరును ఖరారు చేశారు. స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి అకాల మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. రాష్ట్రంలో పెద్ద యెత్తున ఉప ఎన్నికలు వస్తుండడంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై చాలా త్వరగా కసరత్తు ప్రారంభించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఒకటి రెండు రోజులుండగా అభ్యర్థులను ఖరారు చేసే తన సహజ సంప్రదాయానికి భిన్నంగా ఆయన ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. నాయకుల మధ్య సమన్వయానికి కృషి చేస్తున్నారు. ఉప ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మిగతా పార్టీలు అభ్యర్థులు ఖరారు చేసేలోగానే ప్రచారంలోకి దిగి ఓటర్లను తమ వైపు లాక్కోవాలనే ఎత్తుగడతో ఆయన వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+