సిఎం రాజకీయ లబ్ధికే ఎసిబి దాడులు: దేవేందర్ గౌడ్

మద్యం సిండికేట్లలోని ప్రజాప్రతినిధుల పేర్లను వెల్లడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని ఈ నెల 21వ తేదీన రాష్ట్రంలోని అన్ని ఆబ్కారీ పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. దీనిపై వచ్చే నెల 6,7 తేదీల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. మద్యం సిండికేట్లపై ఎసిబి చేసిన దాడుల వివరాలను వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లిక్కర్ మాఫియాలో ఉన్న పెద్ద మనుషుల పేర్లను తక్షణమే బయటపెట్టాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. దీని వెనక ఏ మతలబు లేకపోతే సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన ప్రశ్నించారు.గ్రూప్ వన్ ఫలితాల్లో ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుమానం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోందని, తనకు కూడా ఆ అనుమానం ఉందని ఆయన అన్నారు. వెంటనే ఆ పరీక్షను రద్దు చేసి, మరోసారి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత పెద్ద యెత్తున ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. రష్యాలో భగవద్గీతపై నిషేధం వ్యవహారంలో ప్రధాని, ఇతర మంత్రులు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications