హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని చంపింది మేమే: అనుచరులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Patolla Govardhan Reddy
హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని తామే చంపామని అతని అనుచరులు ప్రకటించారు. ఉప్పల్ భూవివాదమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాదులో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తమకు ఎవరితోనూ సంబంధాలు లేవని వారు చెప్పారు. రెండు రోజుల్లో తాము పోలీసులకు లొంగిపోతామని కూడా వారు చెప్పారు. అనిల్, శ్రీనివాస్, ప్రశాంత్, హేమంత్, నరేందర్ ఆ విషయాలు చెప్పినట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నిందితులు ఐదుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి పలు కేసుల్లో నిందితుడు. అతనిపై 65 కేసులున్నాయి. వాటిలో 12 హత్య కేసులు. తొలుత విప్లవోద్యమంలో పనిచేసిన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఆ తర్వాత తన సొంత ముఠాను సిద్ధం చేసుకుని, సెటిల్మెంట్లకు దిగాడు. అయితే, తన భర్తను నయీమ్ గ్యాంగ్ హత్య చేసిందని పటోళ్ల గోవర్దన్ రెడ్డి భార్య వింద్యా రెడ్డి ఆరోపిస్తున్నారు.

English summary
Patolla Govardhan Reddy followers said that they killed him in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X