ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ఆర్ బావమరిది రవీంద్రనాథ్‌కు కేంద్రం ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలోని ఆయన సంస్థ రవి బెరైటీస్ కంపెనీ మైనింగ్ లీజును గనుల శాఖ సస్పెండ్ చేసింది. ఆ కంపెనీ అధీనంలోని భూమిలో తక్షణం పనులు నిలిపేయాలని కలెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోవడం, వార్షిక లెక్కలు సమర్పించకపోవడం, షోకాజ్‌లకు స్పందించకపోవడం తదితర కారణాలతో ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.

మైనింగ్ రవాణా అనుమతులను కూడా నిలిపి వేస్తున్నారని సమాచారం. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురానికి చెందిన బి.లక్ష్మన్న ఆధ్వర్యంలోని కేశవరాం క్వార్ట్జ్‌మైన్ కంపెనీ, వేంసూరు మండల కేంద్రానికి చెందిన ఎన్.చెన్నారావు ఆధ్వర్యంలోని గుమ్మడివెల్లి ఫీల్డ్ స్పార్క్‌మైన్ కంపెనీలు నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలను కూడా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

English summary
Central Government gave shock to late YS Rajasekhar Reddy relative Ravindranath Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X