అధికారంలోకి వస్తే మద్యం మేమే అమ్మిస్తాం: చంద్రబాబు
మద్యం అక్రమాలలో కేవలం టిడిపి నేతల పాత్ర మాత్రమే లేదని అన్ని పార్టీల వారు ఉన్నారన్నారు. మా పార్టీ వారు ఎవరైనా ఉంటే వారిని పక్కన పెడతామన్నారు. పద్దెనిమిది మంది మృతి చెందినా ముఖ్యమంత్రి పరామర్శకు రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పాలసీల కారణంగానే నాటుసారాకు సామాన్యులు బలవుతున్నారన్నారు. పేదల రక్తం పిండి సంక్షేమ పథకాలు అమలు చేయాలా అని ప్రశ్నించారు. కాంగ్రెసు హయాంలో బెల్టు షాపులు పెరిగాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. కుటుంబాలకు తమ పార్టీ తరఫున రూ.యాభై వేల నష్టపరిహారం ప్రకటించారు. కాగా బాబు అక్కడి నుండి మైలవరం చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
కాగా మైలవరం ఘటన దురదృష్టకరమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ హైదరాబాదులో అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కమిటీ వేస్తామని చెప్పారు. ఇక నుండి అసెంబ్లీ 60 దినాలు ఉండేలా చూస్తామన్నారు.