విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ త్వరలో తేలుతుంది, విభేదాలు లేవు: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విజయవాడ: తెలంగాణ అంశం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసులో విభేదాలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసులో రెండు వర్గాలు ఉన్నాయన్న వాదనలను ఆయన కొట్టి పారేశారు. అదంతా మీడియా సృష్టియేనన్నారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీ నాయకత్వాన్ని అంగీకరించే వారినే పార్టీలో చేర్చుకుంటామన్నారు.

మైలవరం ఘటన విచారకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సిండికేట్ వ్యవహారంలో పత్రికలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాగా మద్యం సిండికేట్ వ్యవహారంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణది ప్రాధన పాత్ర అని తెలుగుదేశం పార్టీ సహా పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

English summary
PCC chief Botsa Satyanarayana said that Telangana will solve soon. He clarified that he have no differences with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X