పటోళ్ల కేసు చిక్కు వీడినట్లేనా?, లొంగిన ఐదుగురు

కాగా పటోళ్లను చంపింది తామేనంటూ ఐదుగురు వ్యక్తులు ఓ ఛానల్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్, ప్రశాంత్ రెడ్డి, అహ్మద్, శ్రీనివాస్, నరెందర్ అనే ఐదుగురు ఆ ఛానల్ ఎదుటకు వచ్చారు. తమను చంపుతాడనే ఉద్దేశ్యంతోనే పటోళ్లను చంపేసినట్లు చెప్పారు. పటోళ్ల అనేకమంది అమాయకులను చంపాడని, మాలో గ్రూపులు సృష్టించనందుకే హత్య చేశామన్నారు. మా డబ్బులు తింటూ మమ్మల్నే టార్గెట్ చేసుకున్నాడన్నారు. ఆయనతో ఉంటే మూడు పోలీసు స్టేషన్లు, ఆరు కేసులు తప్పవన్నారు. తాము అతనిని చంపకపోతే ఆయన చేతిలో తాను హతమయ్యే వాడిని అనిల్ చెప్పారు. పటోళ్ల నడిపించేది చీకటి సామ్రాజ్యమని, ఆయనకు తామంతా సహకరించామన్నారు. పార్టీ ముసుగులో చీకటి దందా చేశాడన్నారు. తాము ఎక్కడున్నామో తమ కుటుంబ సభ్యులకు తెలియదని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.












Click it and Unblock the Notifications