వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ మంత్రుల గోడు, ఆజాద్ ఓపిక మంత్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తేల్చే విషయంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ తెలంగాణ మంత్రులకు పాత ఉపదేశమే చేశారు. హైదరాబాదు వచ్చిన ఆజాద్‌ను తెలంగాణకు చెందిన చెందిన మంత్రులు కలిశారు. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని తెలంగాణ మంత్రులు ఆజాద్‌ను కోరారు. తమకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తమ గోడును వినిపించారు. ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని, పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారు చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో మరింత జాప్యం చేస్తే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు చెప్పారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయకపోతే ఇబ్బందులు తప్పవని వారు చెప్పారు. తొలుత ఒక్కొక్కరు ఆజాద్‌ను కలిశారు. ఆ తర్వాత జానా రెడ్డి, గీతారెడ్డి సహా ఆరుగురు మంత్రులు ఆజాద్‌ను కలిశారు. ఆజాద్‌తో వారు 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడారు.

తెలంగాణపై నిర్ణయానికి కాస్తా ఒపిక పట్టాలని ఆజాద్ తెలంగాణ మంత్రులతో చెప్పారు. పార్టీ అధిష్టానం ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తలమునలై ఉందని, దాంతో తెలంగాణపై దృష్టి పెట్టలేకపోతోందని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్న ప్రతిసారీ ఏదో సమస్య వచ్చి పడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులతో తాను మరోసారి సమావేశవుతానని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రుల అభిప్రాయాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు. గురువారం ఉదయం నుంచి ఆజాద్‌తో భేటీ కోసం కాంగ్రెసు నాయకులు, మంత్రులు క్యూ కట్టారు. ప్రభుత్వం, పార్టీకి మధ్య సమన్వయం కోసం సమన్వయ కమిటీ సమావేశమవుతోందని ఆయన అన్నారు.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi Azad suggested Telangana ministers to wait for some tome to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X