చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పరువునష్టం దావా కొట్టివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Radhakrishna
చిత్తూరు: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, మాజీ ఎడిటర్ శ్రీరామచంద్ర మూర్తిలపై ఓ పోలీసు ఉన్నతాధికారి వేసిన పరువు నష్టం దావాను చిత్తూరు జిల్లా కోర్టు బుధవారం కొట్టి వేసింది. ఐదేళ్ల క్రితం 2006లో ఓ వ్యక్తి అదృశ్యమైన కేసు విచారణలో అప్పటి జిల్లా ఎస్పీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ఆంధ్రజ్యోతి అప్పుడు రాసింది. హైకోర్టు తనపై ఆగ్రహం వ్యక్తం చేసిందన్న ఆంధ్రజ్యోతి వార్తపై ఎస్పీ, రాధాకృష్ణ, శ్రీరామచంద్ర మూర్తిలపై చిత్తూరు జిల్లా నాలుగో అదనపు మెజిస్ట్రీట్ కోర్టులో క్రిమినల్ కేసు, జిల్లా కోర్టులో రూ.కోటికి పరువు నష్టం దావా వేశారు. అప్పటి నుండి రెండు కోర్టుల్లో విచారణ కొనసాగింది.

అయితే ఈ కేసులో తగిన ఆధారాలు లేని కారణంగా నాలుగో అదనపు మేజ్రిస్టేట్ కోర్టు గత నవంబరు 25న క్రిమినల్ కేసును కొట్టివేసింది. తాజాగా జిల్లా కోర్టు సైతం పరువు నష్టం దావాను కొట్టివేస్తూ బుధవారం తీర్పు చెప్పింది. కాగా ఈ రెండు కేసుల్లో ప్రముఖ న్యాయవాది ద్వారకానాథ రెడ్డి ఆంధ్రజ్యోతి తరఫున వాదించారు.

English summary
Chittoor district court dismissed petition against Andhrajyothy MD Radhakrishna on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X