జగన్ క్షమాపణ చెప్పాలి, చిరును అడ్డుకుంటాం: హరీష్
టిఆర్ఎస్ త్యాగాల పునాదులపై ఏర్పడిందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు తమ వైఖరిని స్పష్టం చేయలేదని సాక్ష్యాత్తు చిదంబరమే చెప్పారన్నారు. రైతులను అవమానపర్చిన బాబు రైతు యాత్ర చేయడం విడ్డూరమన్నారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిషేధిస్తే బాబు బార్లా తెరిచారన్నారు. ఆయన ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. హరీష్ టిటిడిపి ఫోరం నేతలపైనా విరుచుకు పడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా మోత్కుపల్లి, ఎర్రబెల్లిల వైఖరి ఉందన్నారు. మోత్కుపల్లి తేది నిర్ణయిస్తే కెసిఆర్ తన ఆస్తులు తెలంగాణ ప్రజలకు పంచుతారని, బాబు తన ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంపేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణకు కెసిఆర్ కుటుంబమే అడ్డైతే తాను, కెటిఆర్ తప్పుకుంటామని మీరు రాష్ట్రం తీసుకు వస్తారా అని సవాల్ చేశారు. సీమాంధ్ర ఫ్యాక్షనిస్టు నేతలను వరంగల్ టూర్కు ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. బాబు టిఆర్ఎస్పై చేసిన విమర్శలు టిటిడిపి నేతలకే వర్తిస్తాయన్నారు. తెలంగాణ కోసం మేం జైళ్లకెళ్లామని వారేం చేశారని ప్రశ్నించారు.