మహబూబ్నగర్ సీటుపై వైయస్ జగన్కు కొర్రీ

కాంగ్రెసు టికెట్ ఇస్తే మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడానికి విజయలక్ష్మి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె అధకారికంగా చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని ఆమె ఇతర పార్టీలను కోరుతున్నారు కూడా. నిజానికి, విజయలక్ష్మి తమ పార్టీకి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో వైయస్ జగన్ ఏకగ్రీవ ఎన్నిక ప్రతిపాదనను తెచ్చారు. అయితే, అది తిరగబడి కాంగ్రెసుకు అనుకూలంగా మారింది. రాజేశ్వర రెడ్డి జీవించి ఉన్నట్లు ఆయన వైయస్సార్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కాంగ్రెసు పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications