ఎన్నికల్లో పోటీ చేస్తే బాలయ్యను గెలిపిస్తా: హరికృష్ణ

పంటలు నష్టపోయి రైతులు తీవ్రంగా దెబ్బ తిన్నారని ఆయన అన్నారు. ఆడపడుచుల పసుపు కుంకుమలను ప్రభుత్వం తుడిచేసిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. రైతులకు కాంగ్రెసు పార్టీ నాయకులు కల్లిబొల్లి కబుర్లు చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేశారని ఆయన అన్నారు. వ్యవసాయం తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని, ధాన్యం అంటే ఏమిటో కూడా కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదని, ధాన్యం దేనికో పండుతుందని అనుకుంటున్నాడని, పండడానికి ధాన్యం చెట్టుకు కాసే కాయలు కావనే విషయం ముఖ్యమంత్రికి తెలియదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications