కెసిఆర్, కోదండరామ్ 'జగన్నా'టకం: రేవంత్ రెడ్డి
వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ నీళ్లు, ఉద్యోగాలు, నిధులు దోచుకున్నారని, దోచుకున్నవాటిని తిరిగి ఇస్తానని జగన్ చెప్పాడా, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తానని హామీ ఇచ్చాడా, తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తానని హామీ ఇచ్చాడా అని ఆయన అన్నారు. ఏదీ చేయని జగన్కు తెలంగాణలో ఎందుకు స్వాగతం చెబుతున్నారని ఆయన అడిగారు. జగన్ తెలంగాణ పర్యటనకు వస్తే కోదండరామ్, కెసిఆర్, వారికి కోరస్ పాడే నాగం జనార్దన్ రెడ్డి ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జగన్ కరుడు గట్టిన సమైక్యవాది అని, అధికారంలోకి వస్తే తెలంగాణను దోచుకుంటాడని ఆయన అన్నారు.
జగన్ అవినీతి సొమ్ముకు కెసిఆర్, కోదండరామ్, నాగం జనార్దన్ రెడ్డి కక్కుర్తి పడ్డారా అని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీపై సంచలన ప్రకటనలు చేసి నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారని, జగన్తో నాగం జనార్దన్ రెడ్డికి రహస్య అవగాహన ఉందని తాము అప్పటి నుంచే చెబుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణలోని ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఆయన చెప్పారు.