కిరణ్ వర్సెస్ దామోదర: లీకుపై బొత్సను నిలదీసిన ఆజాద్

కాగా బొత్స ఆజాద్తో గంటన్నర పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆజాద్, సిఎంపై వచ్చిన విమర్శలను అధిష్ఠానం దృష్టికి నేను తీసుకు వెళ్లానని, సంక్రాంతి తర్వాత సిఎం ఇక త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా చూస్తామని బొత్సకు చెప్పారని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కూడా సంక్రాంతి తర్వాత జరుగుతుందని, చిరంజీవి వర్గం నేతలకు ఈ నెల 19న అవకాశం కల్పిస్తారని ఆజాద్ చెప్పినట్లు తెలుస్తోంది. మార్చిలోనే కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఈలోపు కేంద్ర కేబినెట్లోకి చిరంజీవిని తీసుకునే విషయం పరిశీలిస్తామని కూడా ఆజాద్ చెప్పినట్లు సమాచారం. ఉప ఎన్నికలు ఎప్పుడు జరగాలన్న విషయమూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా, ఆజాద్ను తాను మర్యాదపూర్వకంగా కలిశానని, నిజానికి ఢిల్లీకి కొత్త ఇంటి కోసమే వచ్చానని బొత్స చెప్పారు.












Click it and Unblock the Notifications