హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉపఎన్నికలు: అభ్యర్థులపై కాంగ్రెసు వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై కాంగ్రెసు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు శాసనసభ స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా నాగర్‌కర్నూల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెసు కూడా అభ్యర్థులను ముందే నిర్ణయించాలనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. మహబూబ్ నగర్ నుండి ప్రాతినిథ్యం వహించిన దివంగత రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెసుకు అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి విజయలక్ష్మిని కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగా దిగితే ఏ పార్టీ పోటీ చేయనని చెబుతున్నాయని ఆమె సిఎంకు చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో నాగంపై పోటీకి దామోదర రెడ్డి సై అంటున్నారు. పార్టీ కూడా దాదాపు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం.

కొల్లాపూర్ నుండి జూపల్లి కృష్ణారావుపై పోటీ చేసేందుకు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే చిన్నారెడ్డి స్థానికేతరుడు కావడం వల్ల అంత ప్రభావం చూపరనే వాదనలు వినిపిస్తున్నాయి. జూపల్లి కాంగ్రెసు నుండి టిఆర్ఎస్‌లోకి వెళ్లినందున ఆయనకు గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు ఉండే వారిని ఎన్నిక చేసుకోవాలని కాంగ్రెసు భావిస్తోంది. అదిలాబాద్‌లో జోగు రామన్నపై పోటీ చేసేందుకు ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు. సర్వే చేసి వారిలో ఒకరిని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. స్టేషన్ ఘనపూర్ నుండి టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న రాజయ్య కాంగ్రెసు నుండి వెళ్లిన వాడే.

ఈయనపై పోటీకి మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంతో పాటు మరో ఇద్దరు ప్రధానంగా రేసులో ఉన్నారు. కామారెడ్డి నుండి టిడిపి నుండి వెళ్లిన గంపా గోవర్ధన్‌పై పోటీకి మాజీ మంత్రి షబ్బీర్ అలీని రంగంలోకి దింపాలని నేతలు భావిస్తున్నప్పటికీ, ఆయన సుముఖంగా లేరట. అక్కడ ఇతర నేతలను ఎవరినైనా రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీమాంధ్ర విషయానికొస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజవర్గం నుండి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై శ్రీనివాస రెడ్డి పోటీ చేయనున్నారని సమాచారం.

English summary
Congress going with new strategy on Telangana bypoll. CM Kiran Kumar Reddy and PCC chief Botsa Satyanarayana thinking to announce candidates as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X