కిరణ్ది చంద్రబాబు వారసత్వం: అంబటి రాంబాబు
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు హామీ ఇస్తే విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయని చంద్రబాబు అన్నారని, ఉచిత విద్యుత్ సాధ్యమని వైయస్ నిరూపించారని ఆయన అన్నారు. పంటలు ఎండిపోతే గానీ రైతులకు బుద్ధి రాదని 1999 ఏప్రిల్ 13న చంద్రబాబు అన్న మాట నిజం కాదా అని ఆయన అడిగారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని అడిగితే కాల్పులు జరిపిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ కోసం పోరాడుతానని అంటున్నారని ఆయన అవహేళన చేశారు. బషీర్బాగ్ కాల్పుల సంఘటనపై క్షమాపణ చెప్పిన తర్వాతనే చంద్రబాబు విద్యుత్ సమస్యపై ఉద్యమించాలని ఆయన అన్నారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తనపై తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తనపై ఏమైనా ఆధారాలుంటే సిబిఐకి సమర్పించాలని ఆయన సూచించారు. లేనిపోని ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. నైతిక విలువలు ఉంటే తప్పుడు ఆరోపణలు చేయకూడదని ఆయన అన్నారు.