అరకులో టెన్షన్: ఎమ్మెల్యేల శిక్షణ, మావోల కరపత్రాలు

బుధవారం ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి బయలు దేరి వెళ్లారు. విశాఖలో అరకు వెళ్లేందుకు రెండుసార్లు ట్రయల్ రన్ వేశారు. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో సిఎం అరకు పర్యటన రద్దయింది. మరోవైపు మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు వెలిసిన ప్రదేశం ఎమ్మెల్యేల శిక్షణా కేంద్రానికి కేవలం పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా సమాచారం. కాగా లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ శిక్షణలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయన 2009లో మొదటిసారి కూకట్పల్లి నియోజకవర్గం నుండి గెలుపొందారు. మంగళవారం తరగతులలో పాల్గొన్న చిరంజీవి ఈ రోజు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications