Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రుల్లో అసంతృప్తి లేదు: ఏరాసు ప్రతాప రెడ్డి

Erasu Pratap Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో అసంతృప్తి ఉందనే వార్తలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఖండించారు. మంత్రుల్లో అసంతృప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనేది తమ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి ఇష్టప్రకారం జరుగుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. భాగస్వామ్య సదస్సుపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భాగస్వామ్య సదస్సు సీమాంద్ర సదస్సులాగా జరిగిందని వివేక్ చేసిన విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాట్లాడుతున్న పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు ఆ విధంగా మాట్లాడుతున్నారని, అలా మాట్లాడడంలో అసహజమేమీ లేదని ఆయన అన్నారు. భాగస్వామ్య సదస్సుకు వచ్చినవారంతా పాతవారేనని ఆయన చెప్పారు. తమ కార్యకలాపాలకు ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ లాభసాటిగా ఉంటుందనే విషయాలను చూసుకునే పారిశ్రామికవేత్తలు వస్తారని, ప్రభుత్వం తాను కల్పించే సౌకర్యాలను చెప్పి, వారిని ఆకర్షించేందుకు మాత్రమే ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.

భాగస్వామ్య సదస్సు సీమాంధ్ర సదస్సులా జరిగిందని వివేక్ చేసిన ప్రకటనను ఎమ్మెల్సీ రంగారెడ్డి కూడా ఖండించారు. కొంత మంది పని కట్టుకని విభేదాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. భాగస్వామ్య సదస్సు ఓ ప్రాంతీయ సదస్సు కాదని, పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చారని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+