వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఆస్తుల కేసుపై విజయమ్మ పిటిషన్:నేడు విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల కేసును మరో కోర్టుకు బదలీ చేయాలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. నిష్పాక్షికత కోసం కేసు విచారణనను రాష్ట్రం నుండి మరో హైకోర్టుకు బదలీ చేయాలని లేదా సుప్రీం కోర్టులోనే విచారణ జరపాలని వైయస్ విజయమ్మ తన పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు, మిగిలిన ప్రతివాదులు నాట్ బిఫోర్ ద్వారా విచారణపై అనుమానాలకు అవకాశమిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని రెండు నెలల క్రితం వైయస్ విజయమ్మ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. ఆమె పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సిబిఐ, ఈడి, డిజిపి పోలీసు విచారణకు ఆదేశించింది. అనంతరం సుప్రీం సూచనల మేరకు విచారణపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడం, విచారణపై స్టే విధించడం తెలిసిందే.

మరోవైపు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం గనుల కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో నేడు విచారణకు రానుంది. ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి ఇటీవల బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్ సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ ఆమె బెయిల్ రద్దయింది. దీంతో ఆమె ఈ నెల 6వ తేదిన సిబిఐ కోర్టులో లొంగిపోయారు. ఆమె బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించారు.

English summary
Pulivendula MLA YS Vijayamma petition on TDP chief Nara Chandrababu Naidu will come to hear in Supreme Court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X