వైయస్ జగన్పై రామోజీ ఈనాడు డైలీ మరో అస్త్రం

ఒకే వ్యక్తి డైరెక్టరుగా ఉన్న 16 కంపెనీల్లో ఆరు తమిళనాడు కేంద్రంగా స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఈటీవీ కార్పొరేషన్లో ప్రమోటర్ కంపెనీలుగా ఉన్నాయని, ఈటీవీ కార్పొరేషన్ పేరుకే లిస్టెడ్ కంపెనీ అని, ఆడిటింగ్ నిబంధనలు పాటించనందుకు ఇందులో 2003 నుంచి ఎస్ఎస్ఇ, బిఎస్ఇలు ట్రేడింగ్ లావాదేవీలు ఆపేశాయని ఈనాడు దినపత్రిక రాసింది. ఈటీవీ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా ఉన్నవారి పేర్లను కూడా ఈనాడు దినపత్రిక రాసింది. వైయస్ ప్రభుత్వం నుంచి మేళ్లు పొందిన వారి దగ్గర జరిపిన వసూళ్లను జగతిలోకి మళ్లించేందుకు కోల్కత్తా, ముంబై, గుజరాత్ కేంద్రాలుగా నమోదైన ఆ నెట్ వర్క్ కంపెనీలను వాడుకున్నట్లు తెలుస్తోందని ఈనాడు దిపనత్రిక అనుమానించింది.
కోల్కత్తా కంపెనీల నుంచి 2007లోనే జగతి పబ్లికేషన్లోకి నిధుల వరద ప్రారంభమైందంటూ ఎలా ఆ నిధులు ప్రవహించాయో ఈనాడు దినపత్రిక వివరించింది. ఆ కంపెనీల గుట్టును ఆదాయం పన్ను శాఖ విప్పిందని రాసింది. ఆ కంపెనీల పేర్లను కూడా ఈనాడు దినపత్రిక ఇచ్చింది. జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్లు ఆయా కంపెనీల పేరిట లేవని తెలిపింది. అవి ముంబైకి చెందిన అవంత్ గ్ర్డేడ్ ఫ్యాషన్వేర్, షావ్రతావ్ ఇండస్ట్రీస్, ఐఎ ండ్ ఐసి ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బదిలీ అయినట్లు తెలిపింది. 22 కంపెనీల పేరిట ఉన్న షేర్లు చివరకు మూడు కంపెనీల పేరిటకు బదిలీ అయినట్లు ఈనాడు దినపత్రిక రాసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications