రాజ్యసభ సీటు రేసులో రేణుకా చౌదరి, చిరు ఖాయం

మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. మిగతా సీట్ల కోసం రేణుకా చౌదరితో పాటు శాసనసభ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు పి. నర్సా రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. చిరంజీవిని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుండడంతో ఆయన రాజ్యసభ సీటుపై ఏ విధమైన సందేహం లేదని చెబుతున్నారు.
చిరంజీవి రాష్ట్రం నుంచి ఏడో కేంద్ర మంత్రి అవుతారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రస్తుతం ఎస్ జైపాల్ రెడ్డి, వి. కిశోర్ చంద్రదేవ్, జైరాం రమేష్, దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంఎం పళ్లం రాజు, పనబాక లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే విషయంపై సందేహాలు అవసరం లేదని మంత్రి గంటా శ్రీనివాస రావు అంటున్నారు.












Click it and Unblock the Notifications