తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపైనా ఫైర్, బాలయ్యను తీసేసిన చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి: సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత తన ఒక్కడికే ఉందని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి సోమవారం అన్నారు. తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు చిరంజీవి ఉదయం తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం అని చెప్పి పార్టీని అమ్మేసుకున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత తన ఒక్కడికే ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో పుంజుకోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో అభద్రతా భావం కనిపిస్తోందన్నారు. టిడిపిలో ఉన్నప్పుడు బిసి కోటాలో పదవి పొందిన సి.రామచంద్రయ్య ఇప్పుడు ఓసి ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయన హోదాకు తగిన మాటలు మాట్లాడాలని సూచించారు.

కాగా అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు చెప్పారు. నందమూరి బాలకృష్ణ తనపై పోటీ చేస్తారనే అంశంపై స్పందిస్తూ ఆయన అన్న వ్యాఖ్యల్లో తప్పేమిటన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చునని చెప్పారు.

English summary
Tirupati MLA Chiranjeevi countered hero Balakrishna and TDP president N Chandrababu Naidu comments against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X