పీఠంపై కన్ను!: సిఎం కిరణ్ వర్సెస్ డిప్యూటీ దామోదర
సోమవారం దామోదర కిరణ్ తీరుపై మండిపడ్డారట. శంకర రావు, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ తదితర దళిత నేతల వెనుక దామోదర ఉన్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన దామోదర సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూ సమయం వచ్చినప్పుడల్లా సిఎం దళిత వ్యతిరేకి అంటూ మండిపడుతున్నారట. తద్వారా దళిత నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెడ్డి - కమ్మ వర్గాలకు చెక్ చెప్పి దళిత కార్డు ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం సభలు, సమావేశాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారట.
ఇప్పటికే బొత్స సత్యనారాయణతో పీకలోతుల విభేదాల్లో కూరుకుపోయిన కిరణ్కు దామోదర కొత్త తలనొప్పి తయారయ్యారనే చెప్పవచ్చు. గీతా రెడ్డిని కాదని దామోదరకు డిప్యూటీ కట్టబెట్టడం, ఆ తర్వాత ఆయనే కొరకురాని కొయ్యగా మారటం కిరణ్ వర్గానికి రుచించడం లేదట. ఆయనను డిప్యూటీ చేసి పొరపాటు చేశామని కిరణ్ వర్గం భావిస్తోందట.