ఎంపీని, నన్నడిగే హక్కు బొత్సకు లేదు: హర్ష కుమార్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గులాం నబీ ఆజాద్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆజాద్ పనితీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆజాద్ హైదరాబాద్ వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలకు కేటాయించింది కేవలం 40 నిమిషాలు మాత్రమేనని, అది కూడా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ గేటు వద్ద ఉండి లోనికి పంపించిన వారితోనే మాట్లాడారని ఆరోపించారు. పార్టీకి ఎంత సమయం కేటాయించారో మిగతా అంశాలకు ఎంత సమయం కేటాయించారో ఆయన వచ్చినప్పుడల్లా కార్యకర్తలు, నాయకులు ఎలా అసంతృప్తికి గురవుతున్నారో అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలు పార్టీ పరిస్థితి గురించి వాస్తవాలు చెబుతారని, తద్వారా పార్టీ స్థితిగతులు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.
కానీ, అలాంటి వారికి ఆజాద్ సమయం ఇవ్వటం లేదని చెప్పారు. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న వీరప్పమొయిలీ గంటల తరబడి కార్యకర్తలతో మాట్లాడేవారన్నారు. ఆజాద్ ఇలా అహంకార ధోరణితో వ్యవహరించటం పార్టీకి మంచిది కాదన్నారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను ఇవ్వటం వల్లనే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోందని, అది మర్చిపోవడం సరికాదని హెచ్చరించారు. సమన్వయ కమిటీలోని బొత్స, డీఎస్, చిరంజీవిలను ఒకే సామాజిక వర్గంగా పరిగణించాలని, ఇందులో బిసిలు, ఎస్సీలు, ఎస్టిలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి సమతుల్యం పాటించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications