సునీల్ రెడ్డి వైయస్ జగన్కు ఎలా దగ్గరయ్యాడు?

సునీల్లోని చురుకుదనాన్ని గమనించిన జగన్ ఆయనను తన ఆంతరంగికుడిగా నియమించుకున్నారు. వ్యక్తిగత సహాయకుని హోదా కల్పించారు. ఇక, అప్పటి నుంచి జగన్ ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలన్నీ సునీల్ రెడ్డే చక్కబెట్టేవాడని చెబుతారు. జగన్ విద్యుత్తు రంగంలోకి అడుగు పెట్టిన మొదటి కంపెనీ సరస్వతి పవర్. దీని నుంచి మొదలుకుని ఆ తర్వాత జగన్ సృష్టించిన చాలా కంపెనీల్లో జగన్ సతీమణి భారతీ రెడ్డితోపాటు సునీల్ కూడా ఒక డైరెక్టర్. ఆమెకు సునీల్ సన్నిహిత బంధువు కూడా. ఎటువంటి హోదా లేకపోయినా జగన్ శిబిరంలో అన్నీ ఆయనే. జగతి పబ్లికేషన్స్లోకి నిధులు మళ్లించారని చెబుతున్న కంపెనీల్లో - కీలాన్ టెక్నాలజీస్కు విజయసాయిరెడ్డి ఆయన భార్య ప్రమోటర్లు అయితే, మిగిలిన ఐదు కంపెనీలూ - జడ్ఎం ఇన్ఫోటెక్, సిగ్మా ఆక్సిజన్, సాయిసూర్య వేర్హౌజింగ్, ఎక్సెల్ ప్రోసాఫ్ట్, రెవెరాలు జగన్ వ్యాపార సామ్రాజ్యానికి కేంద్రంగా చెప్పే సండూర్ పవర్కు ఇన్వెస్టర్ల హోదాలో నిధులు సమకూర్చాయి. ఈ ఐదు కంపెనీల్లోనూ జగన్ భార్య భారతీ రెడ్డితోపాటు సునీల్ రెడ్డి.
ఈ నేపథ్యంలోనే సునీల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి డబ్బులు అందజేసింది సునీల్ రెడ్డేనని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ రెడ్డి ప్రస్తావన ఉందని, ఆ తర్వాతే ఆయనపై సీబీఐ దృష్టి సారించిందని తెలుస్తోంది. అన్ని అంశాలనూ ద్రువీకరించుకున్న తర్వాతే సునీల్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. జగన్ పేరు చెబితే ఒంటికాలిపై లేచే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని అల్లుడే ఈ సునీల్ రెడ్డి. కడప జిల్లా నక్కలదిన్నెకు చెందిన వీరశివారెడ్డి సోదరుడి కుమార్తెను సునీల్ రెడ్డి వివాహమాడారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications