సునీల్ రెడ్డి వైయస్ జగన్కు ఎలా దగ్గరయ్యాడు?

సునీల్లోని చురుకుదనాన్ని గమనించిన జగన్ ఆయనను తన ఆంతరంగికుడిగా నియమించుకున్నారు. వ్యక్తిగత సహాయకుని హోదా కల్పించారు. ఇక, అప్పటి నుంచి జగన్ ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలన్నీ సునీల్ రెడ్డే చక్కబెట్టేవాడని చెబుతారు. జగన్ విద్యుత్తు రంగంలోకి అడుగు పెట్టిన మొదటి కంపెనీ సరస్వతి పవర్. దీని నుంచి మొదలుకుని ఆ తర్వాత జగన్ సృష్టించిన చాలా కంపెనీల్లో జగన్ సతీమణి భారతీ రెడ్డితోపాటు సునీల్ కూడా ఒక డైరెక్టర్. ఆమెకు సునీల్ సన్నిహిత బంధువు కూడా. ఎటువంటి హోదా లేకపోయినా జగన్ శిబిరంలో అన్నీ ఆయనే. జగతి పబ్లికేషన్స్లోకి నిధులు మళ్లించారని చెబుతున్న కంపెనీల్లో - కీలాన్ టెక్నాలజీస్కు విజయసాయిరెడ్డి ఆయన భార్య ప్రమోటర్లు అయితే, మిగిలిన ఐదు కంపెనీలూ - జడ్ఎం ఇన్ఫోటెక్, సిగ్మా ఆక్సిజన్, సాయిసూర్య వేర్హౌజింగ్, ఎక్సెల్ ప్రోసాఫ్ట్, రెవెరాలు జగన్ వ్యాపార సామ్రాజ్యానికి కేంద్రంగా చెప్పే సండూర్ పవర్కు ఇన్వెస్టర్ల హోదాలో నిధులు సమకూర్చాయి. ఈ ఐదు కంపెనీల్లోనూ జగన్ భార్య భారతీ రెడ్డితోపాటు సునీల్ రెడ్డి.
ఈ నేపథ్యంలోనే సునీల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి డబ్బులు అందజేసింది సునీల్ రెడ్డేనని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ రెడ్డి ప్రస్తావన ఉందని, ఆ తర్వాతే ఆయనపై సీబీఐ దృష్టి సారించిందని తెలుస్తోంది. అన్ని అంశాలనూ ద్రువీకరించుకున్న తర్వాతే సునీల్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. జగన్ పేరు చెబితే ఒంటికాలిపై లేచే కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి సోదరుని అల్లుడే ఈ సునీల్ రెడ్డి. కడప జిల్లా నక్కలదిన్నెకు చెందిన వీరశివారెడ్డి సోదరుడి కుమార్తెను సునీల్ రెడ్డి వివాహమాడారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications