అనుమానాస్పద స్థితిలో ఎంబిఎ గ్రాడ్యుయేట్ మృతి

పోలీసుల కథనం ప్రకారం - పాండు రంగారెడ్డి సోమవారం ఉదయం 4 గంటలకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆర్థరాత్రి వరకు కూడా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారంనాడు అతని బైక్ హిమాయత్ సాగర్ ఆనకట్టపై పడి ఉండడం గమనించారు. సాయంత్రానికి అతని శవం హిమాయత్ సాగర్లో తేలుతూ కనిపించింది. శవాన్ని వెలికి తీసి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications