హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానాస్పద స్థితిలో ఎంబిఎ గ్రాడ్యుయేట్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Himayat Sagar
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో ఓ ఎంబిఎ గ్రాడ్యుయేట్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని శవం హిమాయత్ సాగర్‌లో మంగళవారంనాడు తేలింది. మృతుడు పాండు రంగారెడ్డి (26) లంగర్‌హౌస్‌లోని బాపూజీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు., అనతు లంగర్‌హౌస్‌లో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నాడు. అదే సమయంలో రాజేంద్ర నగర్‌లోని ఆరే మైసమ్మ ప్రాంతంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం - పాండు రంగారెడ్డి సోమవారం ఉదయం 4 గంటలకు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఆర్థరాత్రి వరకు కూడా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు లంగర్ హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారంనాడు అతని బైక్‌ హిమాయత్ సాగర్ ఆనకట్టపై పడి ఉండడం గమనించారు. సాయంత్రానికి అతని శవం హిమాయత్ సాగర్‌లో తేలుతూ కనిపించింది. శవాన్ని వెలికి తీసి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
An MBA graduate was found dead under suspicious circumstances in Himayathsagar on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X